ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

author img

By

Published : Nov 1, 2019, 10:50 AM IST

Updated : Nov 1, 2019, 6:02 PM IST

పొద్దునే పొలం వెళుతున్న దంపతులను మృత్యువు కబళించింది. రోడ్డు దాటుతున్న ఇద్దర్నీ ట్యాంకర్ ఢీకొట్టటంతో.. వారు అక్కడికక్కడే మృతి చెందారు.

రోడ్డుప్రమాదంలో భార్యాభర్తలు మృతి

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు. పొలం వెళుతున్న కరణం సోమినాయుడు, అతని భార్య పైడితల్లమ్మను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. లారీని అక్కడే వదిలి డ్రైవర్ పరారయ్యాడు. మృతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దంపతుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

చదువు ఒత్తిడి, అవమాన భారంతో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

Intro:Ap_vsp_46_01_Road_pramdamlo_barya_barta_mruthi_av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్త మృతి చెందారు పొలంలో నేపాల్ తీయడానికి రహదారి దాటి వెళుతున్న కరణం సోమినాయుడు(60), అతని భార్య పైడితల్లమ్మ లను పెట్రోల్ ట్యాంకర్ లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు








Body:మృతులకు కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరందరికీ వివాహాలు అయ్యాయి. పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్న వీరి కుటుంబంలో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన పెను విషాదాన్ని నింపింది

Conclusion:రోడ్డు ప్రమాద సంఘటన లో భార్యాభర్తలు మృతి చెందడంతో తాళ్లపాలెం విషాదఛాయలు అలుముకున్నాయి డ్రైవర్ పరారయ్యాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కసింకోట పోలీసులు తెలిపారు

Last Updated :Nov 1, 2019, 6:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.