ETV Bharat / state

వైకాపాలో వర్గపోరు.. మంత్రి రోజాకు తప్పని నిరసనలు

author img

By

Published : Nov 12, 2022, 5:27 PM IST

CLASHES BETWEEN YSRCP LEADERS
CLASHES BETWEEN YSRCP LEADERS

CLASHES BETWEEN YSRCP LEADERS : మంత్రి రోజాకు సొంత పార్టీ నాయకుల నుంచి నిరసనలు తప్పడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. ఉద్రిక్తతల మధ్య తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పత్తిపుత్తూరు గ్రామ సచివాలయాన్ని మంత్రి రోజా ప్రారంభించారు.

వైకాపాలో వర్గపోరు.. మంత్రి రోజాకు తప్పని నిరసనలు

CLASHES BETWEEN TWO YSRCP COMMUNITIES : సొంత పార్టీ నాయకుల నుంచి మంత్రి రోజాకు నిరసన సెగ తప్పడం లేదు. తరచూ ఏదో ఒక రూపంలో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తిరుపతి జిల్లా పడమాలపేట మండలం పత్తిపుత్తూరు గ్రామ సచివాలయం ప్రారంభించాలని మంత్రి రోజా భావించగా... వైకాపా ZPTC మురళీధర్‌రెడ్డి అందుకు ససేమిరా అన్నారు. ఒకే ప్రాంగణంలో నిర్మించిన గ్రామ సచివాలయం, RBK, పాల శీతలీకరణ కేంద్రానికి 34 లక్షలు ఖర్చు చేసినట్లు మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఇంకా 23 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండగానే... మంత్రి రోజా హడావిడిగా ప్రారంభించాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

బిల్లులు చెల్లించాకే ప్రారంభించాలంటూ.. భవన సముదాయనికి తాళాలు వేశారు. అలాగే ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్యాహ్నం తర్వాత మంత్రి రోజా అనుచరులు తాళం పగలగొట్టడంతో... ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత మురళీధర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు రవిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల సమయంలో మంత్రి రోజా పత్తిపుత్తూరు చేరుకుని గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.