ETV Bharat / state

శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ నేడే

author img

By

Published : Sep 26, 2022, 9:36 AM IST

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. అనంతరం మృత్సంగ్రహణ యాత్ర చేపడతారు.

ttd
ttd

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందురోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమాన్ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. వెంకటేశ్వరస్వామి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహిస్తారు. ఆలయానికి నైరుతి దిశలో భూదేవి పూజ అనంతరం మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. ఈ మృత్సంగ్రహణ యాత్ర తర్వాత మట్టిలో నవధాన్యాలను ఆరోహింపజేస్తారు. దీన్నే అంకురార్పణగా పేర్కొంటారు

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.