ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఒడిశావాసులు

author img

By

Published : Oct 29, 2020, 1:30 PM IST

road accident
రోడ్డు ప్రమాదం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం శాసనాం గ్రామ సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా శాసనాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చేపల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం, రహదారి పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జైంది. డ్రైవర్ బైరి గోపాలకృష్ణ రెడ్డి, మరో యువకుడు సుభాష్​కు ముఖం, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి.

టెక్కలి సీఐ, ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ప్రాథమిక వైద్యం అనంతరం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.