ETV Bharat / state

Robbery: శ్రీకాకుళంలో మూడు ఇళ్లపై దాడులు.. నగలు, డబ్బు ఎత్తుకెళ్లిన దుండగులు

author img

By

Published : Mar 13, 2022, 4:29 AM IST

Updated : Mar 13, 2022, 5:34 AM IST

Robbery in Srikakulam District
Robbery in Srikakulam District

Robbery in Srikakulam District: శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు పంచాయతీ శాస్త్రులపేటలో మూడు ఇళ్లపై దుండగులు దాడులు చేశారు. ఇళ్లలోని సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శ్రీకాకుళంలో మూడు ఇళ్లపై దాడులు

Srikakulam District Crime News: శ్రీకాకుళం గ్రామీణ మండలం శాస్త్రలపేటలో దుండగులు రెచ్చిపోయారు. సాయంత్రం సమయంలో మూడు ఇళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేయడంతోపాటు నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. ఆరు లక్షల నగదుతో పాటు మూడున్నర తులాల బంగారం దోచుకెళ్లారని.. బాధితులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన ఐదుగురు పెద్దపాడుకు చెందినవారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Son killed mother: ఆస్తి కోసం అమ్మనే చంపేశాడు!

Last Updated :Mar 13, 2022, 5:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.