ETV Bharat / state

ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే చేస్తాం

author img

By

Published : Sep 6, 2019, 12:56 PM IST

Updated : Sep 6, 2019, 2:36 PM IST

ముఖ్యమంత్రి జగన్

మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని మరచిపోకుండా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ ఉద్ఘాటించారు. ఎన్నికల హామీలన్నీ భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావిస్తానని చెప్పారు. కిడ్నీ సమస్యపై చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకున్నానని... కిడ్నీ బాధితులకు పెన్షన్‌ రూ.10 వేలు ఇస్తూ మొదటి సంతకం చేశానని గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడారు.

ఎన్నికల హామీలన్నీ భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావిస్తానని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఉద్ఘాటించారు. పాదయాత్రకు వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగానన్న సీఎం జగన్... చెప్పిన సమస్యలన్నీ విని తాను ఒకటే చెప్పానన్నారు. ''నేను విన్నాను... నేను ఉన్నానని'' చెప్పానన్న సీఎం... కిడ్నీ సమస్యపై ఇచ్చిన ప్రతి మాటనూ గుర్తుపెట్టుకున్నానని చెప్పారు. కిడ్నీ బాధితులకు పెన్షన్‌ రూ.10 వేలు ఇస్తూ మొదటి సంతకం చేశానని గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి జగన్

200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకొస్తానని చెప్పానన్న సీఎం.. ఇవాళ శంకుస్థాపన చేశానని వివరించారు. డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తున్నామని చెప్పారు. డయాలసిస్‌ వచ్చేముందుగానే స్టేజ్‌-3 బాధితులకు కూడా ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.5 వేలు పింఛన్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి 500 మంది రోగులకు హెల్త్‌ వర్కర్లు ఉంటారన్న జగన్... కిడ్నీ బాధితులందరికీ ఉచిత బస్సు పాస్‌, ల్యాబ్‌లో పరీక్షలన్నీ ఉచితమని ప్రకటించారు.

పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని ప్రతిఒక్కరికి నేరుగా ఇంటింటికి శుభ్రమైన తాగునీరు అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్... మత్స్యకారుల కోసం జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. ఫిషింగ్‌ జెట్టీతో పాటు అన్నిరకాల వసతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. చేపలను కాపాడుకునేందుకు శీతల గోదాములు, మత్స్యకారుల సామాన్లు భద్రపరుచుకునేందుకు షెడ్లు నిర్మిస్తామన్నారు.

ముఖ్యమంత్రి జగన్

సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామన్న సీఎం జగన్... యుద్ధప్రాతిపదికన మహేంద్రతనయ ప్రాజెక్టు పనులు చేయిస్తామని హామీఇచ్చారు. అవ్వ, తాతలకు ఇచ్చే పింఛన్‌ను పెంచి వారి రుణం తీర్చుకున్నానని పేర్కొన్నారు. వృద్ధాప్య పింఛన్‌ను ఏటా రూ.250 చొప్పున పెంచుతామని వివరించారు. అక్టోబర్‌ 15న రైతు భరోసాకు శ్రీకారం చుట్టబోతున్నామన్న ముఖ్యమంత్రి... ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెట్టబోతున్నామని ప్రకటించారు.

మూడు నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని సీఎం జగన్ చెప్పారు. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ను ఏర్పాటు చేసి రూ.5 వేలు వేతనం ఇస్తున్నామని వివరించారు. సంక్షేమ పథకాలన్నీ నేరుగా ఇంటికే వచ్చి అందించేలా ఏర్పాటు చేశామన్న జగన్... నవంబర్‌ 21న ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.

జనవరి 26న అమ్మఒడి పథకం తీసుకొస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. కళాశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని హామీఇచ్చారు. తిత్లీ బాధితులకు పెంచిన పరిహారం శుక్రవారం నుంచే పంపిణీ చేస్తామని చెప్పారు. ఉగాదినాడు రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్న జగన్... ఇంటి స్థలం లేని ప్రతి అక్కచెల్లెమ్మకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. శ్రీరామనవమి రోజున వైఎస్‌ఆర్‌ పెళ్లికానుక ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సెప్టెంబర్ చివరినాటికి సొంత ఆటో ఉన్నవాళ్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. మూడు నెలల కాలంలోనే అసెంబ్లీలో 19 చట్టాలు తీసుకొచ్చామన్న ముఖ్యమంత్రి... 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకొచ్చినట్లు వివరించారు. అక్టోబర్‌ 2న గ్రామ సచివాలయాలు తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ప్రతి 2వేలమంది జనాభా ఉన్న గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే చేసిపెట్టేలా వాలంటీర్లు ఉంటారని చెప్పారు. ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీని పైలట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించారు.

ఇదీ చదవండీ... 'చంద్రబాబుకు పేరు వస్తుందనే.. జగన్​ కక్ష'

Intro:AP_cdp_46_06_prabhutwa madyam_dukhaanam_vidyarthula andolana_Av_Ap10043
k.veerachari, 9948047582
విద్యార్థుల చదువుకునే కళాశాల వద్ద ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం దారుణమని విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఇటీవల ప్రభుత్వ మద్యం దుకాణాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు విన్నవించారు. కానీ విద్యార్థుల మొరను ఆలకించకుండా అధికారులు మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దీనిపై టిఎన్ఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామంటూనే విద్యార్థులు చదువుకుంటున్న కళాశాల వద్దే మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్యం దుకాణాన్ని తొలగించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్ డి ఓ ధర్మచంద్రారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యను ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, ఇదే సమయంలో కలెక్టర్కి కూడా వేదిక పంపిస్తానని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.



Body:మద్యం దుకాణాన్ని తొలగించాలంటే విద్యార్థుల ఆందోళన


Conclusion:టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్
ఆర్ డి ఓ ధర్మచంద్రారెడ్డి
Last Updated :Sep 6, 2019, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.