ETV Bharat / state

MRO demoted: నంబులపూలకుంట తహసీల్దార్​కు డిమోషన్​... ఎందుకంటే..?

author img

By

Published : May 30, 2022, 2:27 PM IST

MRO demoted
తహసీల్దార్ డిమోషన్​

MRO demoted: నంబులపూలకుంట తహసీల్దార్ పి.వెంకట రమణపై రెవిన్యూ శాఖ చర్యలు తీసుకుంది. తహసీల్దార్​ను డిప్యూటీ తహసీల్దార్​గా డిమోషన్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకంటే..?

MRO demoted: ప్రభుత్వ భూమిని రైతు పేరట పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చిన తహసీల్దార్​ను డిప్యూటీ తహసీల్దార్​గా డిమోషన్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా నంబులపూలకుంట తహసీల్దార్ పి .వెంకట రమణపై రెవిన్యూ శాఖ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. వెంకటరమణ కదిరి తహసీల్దారుగా పనిచేసే సమయంలో కదిరి పొలంలోని సర్వే నంబర్ 1784-4లోని 2.36 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక రైతు పేరిట పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారు.

ఈ భూమిని గతంలో ప్రభుత్వం ఒక ఒక రైతుకు డి.పట్టా మంజూరు చేసింది. 2007-08 మధ్య ఇందిరమ్మ గృహాల కోసం అప్పటి ప్రభుత్వం సేకరించి సంబంధిత రైతుకు పరిహారం కేటాయించింది. ఈ భూమిని తహసీల్దార్ వెంకటరమణ... రైతు పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేసిన తహశీల్దార్ వెంకటరమణను డిప్యూటీ తాహసీల్దార్​గా డిమోషన్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.