ETV Bharat / state

Theft: ఆగిఉన్న కంటైనర్​లో చోరీ.. రూ.3 లక్షల విలువైన కూలర్లు అపహరణ

author img

By

Published : Jun 16, 2021, 4:21 PM IST

coolers stolen from container at Ramannapalem
కంటైనర్​లోంచి రూ.3 లక్షల విలువైన కూలర్లు చోరీ

రోజు రోజుకు దొంగలు పేట్రేగిపోతున్నారు. ఏకంగా జాతీయ రహదారిపై చోరీకి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం రామన్నపాలెం వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ నుంచి రూ.3 లక్షల విలువైన కూలర్లు దోచుకెళ్లారు.

ఇళ్లలో చోరీలకు పాల్పడే దొంగలు.. ఇప్పడు ఏకంగా జాతీయ రహదారులపైనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనే నెల్లూరు జిల్లా కోవూరు మండలం రామన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఆగి ఉన్న కంటైనర్‌ నుంచి కూలర్లును దోచుకెళ్లారు. వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

కారు- ట్రక్కు ఢీ.. 10 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.