ETV Bharat / state

ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా ఆధ్వర్యంలో నిరసన

author img

By

Published : May 19, 2020, 4:02 PM IST

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కరోనాకు తోడు కరెంట్​ బిల్లుల రూపంలో ప్రభుత్వం ప్రజలపై మరింత భారాన్ని మోపుతోందని మండిపడ్డారు.

bjp leaders protest against to government
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై భాజపా నిరసన

ఒకవైపు కరోనా వైరస్​తో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై మరింత భారాన్ని వేసిందని భాజపా నేత సన్నారెడ్డి దయాకర్ రెడ్డి విమర్శించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికీ తెలియజేసేందుకు నిరసన చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి...

తిరుపతి ఐఐటీ ఘనత.. ఆన్​లైన్ గేమ్​తో కరోనాపై అవగాహన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.