ETV Bharat / state

వంశధారపై ఒడిశా పిటిషన్‌ కొట్టేయండి..సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌

author img

By

Published : Nov 4, 2021, 11:33 AM IST

నేరడి బ్యారేజీకి సంబంధించి వంశధార జల వివాదాల ట్రైబ్యునల్‌ (వీడబ్ల్యూడీటీ) ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ap government
ap government

నేరడి బ్యారేజీకి సంబంధించి వంశధార జల వివాదాల ట్రైబ్యునల్‌ (వీడబ్ల్యూడీటీ) ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం, ముంపు, రిటైనింగ్‌వాల్‌, ఇతర నిర్మాణాలకు అవసరమైన 106 ఎకరాలను ఒడిశా ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలని వీడబ్ల్యూడీటీ ఈ ఏడాది జూన్‌ 21న తీర్పునిచ్చింది. ఆ తీర్పును ఒడిశా సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. పిటిషన్​ను విచారించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నిర్మాణానికి సంబంధించి గతంలో ఒడిశా లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశామని అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

ట్రైబ్యునల్‌ అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే తుది తీర్పును వెలువరించినందున ఒడిశా పిటిషన్‌ విచారణ అర్హమైనది కాదని తెలిపింది. అందువల్ల ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో విన్నవించింది.

ఇదీ చదవండి:

Amaravathi farmers: మహా పాదయాత్రకు అపూర్వ మద్దతు.. ఇవాళ 11 కి.మీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.