నెల్లూరు జిల్లాలోని పెరమన గ్రామానికి చెందిన వెంకటసుబ్బమ్మ... సంగం ఠాణా ఎదుట పురుగులు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు స్పందించి ఆమె నుంచి పురుగులు మందుసీసాను తీసుకున్నారు. తనకున్న ఐదెకరాల పొలం పక్కనే ఉన్న 75 సెంట్ల భూమిని... 20 ఏళ్లుగా సాగు చేసుకుంటుంది వెంకటసుబ్బమ్మ. అయింతే రెండేళ్లుగా ఆత్మకూరులోని తన కొడుకు వద్దకు వచ్చి నివాసం ఉంది.
ఇదే అదునుగా భావించి... గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సుబ్బమ్మ ఆధీనంలో ఉన్న 75 సెంట్లను ఆక్రమించుకున్నారు. ఈ వ్యవహారంపై కొన్ని నెలలుగా ఇరువురి మధ్య వివాదం జరుగుతూనే ఉంది. ఆక్రమణకు గురైన భూమిని ఇప్పించి తనకు న్యాయం చేయాలని సుబ్బమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు పొలం వద్దకు చేరుకొని విచారించి... సరైన ఆధారాలు చూపించాలని చెప్పారు. అప్పటివరకూ పొలం వద్దకు వెళ్లవద్దని ఆదేశించారు.
పోలీసుల ఆదేశాలను పట్టించుకోని అక్రమదారుడు పొలంలో వరి నాట్ల పనులు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న వెంకటసుబ్బమ్మ పురుగుల మందు డబ్బాతో సంగం పోలీస్ స్టేషన్కు వచ్చింది. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ... ఆందోళనకు దిగింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆమె చేతిలోని పురుగులమందు లాక్కున్నారు. తనకు న్యాయం చేస్తామని పోలీసులు, అధికారులు హామీ ఇవ్వడంతో సుబ్బమ్మ ఆందోళన విరమించింది.
ఇదీ చదవండీ: