ETV Bharat / state

టీడీపీ, జనసేన కలవకుండా జగన్​మోహన్​రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారు : ఎంపీ రఘురామ

author img

By

Published : Jan 13, 2023, 9:58 PM IST

Raghu Rama Krishna Raju
ఎంపీ రఘురామ

Raghu Rama : జనసేన, టీడీపీ పొత్తుపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. వారి కలయిక ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించటమే తక్షణ కర్తవ్యంగా సాగాలని కోరారు. పొత్తుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

Raghu Rama Krishna Raju : సమాజహితం కోసం చంద్రబాబు, పవన్​ కలిసి ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించడమే కర్తవ్యంగా ముందుకు సాగలని ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. రణస్థలంలో జనసేన నిర్వహించిన సభలో పవన్​.. పొత్తులపై స్పష్టతనిచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన పార్టీల రంగు కలిస్తే కషాయమని.. కాషాయ పార్టీ ఈ రెండు పార్టీలకు తోడుండాలని కోరుకునే వారిలో నేనొకడినని రఘురామ అన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలవకుండా జగన్​మోహన్​రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

విడగొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని విమర్శించారు. గతంలో చంద్రబాబును తిట్టి ఇప్పుడు ఆయనతో ఎలా కలుస్తారని వైసీపీ నేతలు ప్రశ్నించటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గతంలో జగన్​ను తిట్టిన నేతలకే జగన్​ మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు. మనం చేస్తే రాజకీయం రాజకీయం ఎదుటి వారు చేస్తే వ్యభిచారమా అని నిలదీశారు. జీవో నెంబర్​ ఒకటిని న్యాయస్థానం రద్దు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.