ETV Bharat / state

మంత్రాలయం ఘాట్​ వద్ద తగ్గిన నదీ ప్రవాహం

author img

By

Published : Nov 22, 2020, 3:41 PM IST

at mantralayam pushkara ghat
మంత్రాలయం పుష్కర ఘాట్

తెలుగు రాష్ట్రాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి తుంగభద్ర పుష్కరాల కోసం.. కర్నూలు జిల్లా మంత్రాలయానికి ప్రజలు తరలి వస్తున్నారు. వచ్చే భక్తులకు అనుగుణంగా.. నదిలో నీటి ప్రవాహం కొరవడింది. పూజల అనంతరం దీపాలు వదిలేందుకూ నీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు.

భక్తుల తాకిడి ఉన్నా.. మంత్రాలయం పుష్కర ఘాట్​ వద్ద నదిలో నీటి ప్రవాహం తగ్గుతోంది. స్నానం అనంతరం నదీమతల్లికి పూజలు చేసి దీపాలు వదిలేందుకు.. ఘాట్ వద్ద నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా మంత్రాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పుష్కర స్నానాల కోసం తరలి వస్తున్నారు. వారంతా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మంత్రాలయం పుష్కర ఘాట్

ఇదీ చదవండి: పుష్కర స్నానాలకు అనుమతివ్వాలని ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.