ఇదీ చదవండి: గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై సిట్ ఏర్పాటు
అలిగిన పాలకమండలి సభ్యులు... ఆలస్యమైన లింగోద్భవ కార్యక్రమం
మహాశివరాత్రి నాడు నిర్వహించే ప్రముఖ కార్యక్రమం లింగోద్భవం... కర్నూలు జిల్లా మహానందిలో ఈ కార్యక్రమంలో పరిమిత సంఖ్యలో ప్రముఖులు పాల్గొంటారు. కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో పాలకమండలి సభ్యులు అలిగి వెళ్ళి పోయారు. దీంతో కార్యక్రమం జరగాల్సిన సమయానికి జరగలేదు. అధికారులు, వేదపండితులు వెళ్ళి వారిని బుజ్జగించి తీసుకొచ్చారు. తర్వాత కార్యక్రమం పూర్తయింది.
మహానందీశ్వరాలయంలో ఆలస్యమైన లింగోద్భవం
Last Updated :Feb 22, 2020, 7:44 AM IST
TAGGED:
lingodbhavam alasyam