ETV Bharat / state

పులికనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులుల కలకలం

author img

By

Published : Aug 31, 2021, 9:35 AM IST

పులికనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులుల కలకలం
పులికనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులుల కలకలం

పులికనుమ ప్రాజెక్టు కొండల్లో చిరుత పులులు సంచరించాయి. వాటిని చూసి గొర్రెల కాపరులు భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం పులికనుమ ప్రాజెక్టు కొండల్లో మూడు చిరుత పులులు సంచారించాయి. చిరుత పులులను చూసి గొర్రెల కాపరులు పరుగు తీశారు. అవి రెండు గొర్రెలను చంపి తిన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Bear Attack: రైతుపై ఎలుగుబంటి దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.