ETV Bharat / state

తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం సబబు కాదు: పోతిన మహేష్

author img

By

Published : Jul 3, 2020, 12:20 PM IST

janasena leader pothina mahesh fires on speaker tammineni words said in ttd
స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై మండిపడ్డ పోతిన మహేష్

తిరుమల సన్నిధిలో స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన మహేష్ బాబు విమర్శలు కురిపించారు. భక్తలు మనోభావాలు దెబ్బతీసేలా దేవస్థానంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

హిందువులకు అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో... స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయాలు మాట్లాడటం సరికాదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన మహేష్ బాబు విమర్శించారు. ఇది ముమ్మాటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న అవినీతిపై నిష్పక్షపాతమైన తీర్పులు ఇచ్చే అత్యున్నత న్యాయస్థానాలను ప్రశ్నించడం సబబు కాదని... చేసిన వ్యాఖ్యలపై స్పీకర్​ తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

'స్పీకర్ తమ్మినేని సీతారాం క్షమాపణలు చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.