ETV Bharat / state

బ్లాక్ మార్కెట్​ను నియంత్రించండి: పోతిన మహేశ్

author img

By

Published : May 23, 2021, 3:26 PM IST

janasena
పోతిన మహేశ్

బ్లాక్ ఫంగస్ వ్యాధికి నాణ్యమైన వైద్యం అందించాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఈ వైరస్ కోసం వాడే లైఫోసొమాల్ ఏంఫో టెర్రిసన్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్​లోకి వెళ్లిపోయిందని.. బ్లాక్​ మార్కెట్​ను ప్రభుత్వం నియంత్రించాలని ఆయన కోరారు.

బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడం వలన ఉపయోగం లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. వారికి తక్షణమే నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. ఈ వైరస్ కోసం వాడే లైఫోసొమాల్ ఏంఫో టెర్రిసన్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్​లోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రెమిడిసివర్ ఇంజక్షన్, లా లేఫోసొమాల్ కూడా ఒక్కొక్కటి బ్లాక్ మార్కెట్​లో 40 నుంచి 50 వేల రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే బ్లాక్ మార్కెట్​ను నియంత్రించాలని కోరారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 25 మంది బ్లాక్ ఫంగస్ రోగులు వైద్యం కోసం ఎదురుచూస్తున్నారని.. వారికి చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి. 'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.