ETV Bharat / state

'3 రాజధానులు... సీఎం మాటే నిపుణుల నివేదికా?'

author img

By

Published : Dec 18, 2019, 11:04 PM IST

janasena fires on jagan 3 capital comments
జనసేన నేతలు

రాజధానిపై వైకాపా ప్రభుత్వం రోజుకో ట్విస్ట్ ఇస్తుందని... జనసేన నేతలు అన్నారు. సినిమా ఇంటర్వెల్, క్లెమాక్స్​లా... అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బొత్స, ముఖ్యమంత్రి జగన్ రోజుకో మాట మాట్లాడరని విమర్శించారు. 13 జిల్లాలున్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. విశాఖలో వైకాపా నేతలు ఇన్​సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్న జనసేన నేతలు
రాజధానిపై సీఎం జగన్.. తన మనసులో మాట చెప్పడానికి నిపుణుల కమిటీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎందుకుని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నేతలు ప్రశ్నించారు. విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలు కలిగిన రాష్ట్రంలో 3 రాజధానులు ఏంటని నిలదీశారు. అసెంబ్లీలో.. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పడం, అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ముఖ్యమంత్రి.. మూడు రాజధానుల ఉండొచ్చని చెప్పడం సినిమా మలుపులను తలపిస్తోందన్నారు.

రాజధాని ఇక్కడా.. అక్కడా అని చెప్పి.. రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెట్టారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో తెదేపా నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్​కు పాల్పడ్డారన్న ముఖ్యమంత్రి... విశాఖలో వైకాపా నేతలు చేసిందేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ ఇప్పటి దాకా కూల్చివేతలకు ఇచ్చిన ప్రాధాన్యం.. నిర్మాణాలు చేపట్టడానికి ఇవ్వలేదన్నారు.

ఇదీ చదవండి:

'వైకాపా ఇన్​సైడర్ ట్రేడింగ్​పై సీబీఐతో విచారణ జరిపించాలి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.