వైకాపా తరపున ఎమ్మల్సీ అభ్యర్ధిగా పెన్మెత్స సూర్యనారాయణ రాజు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వైకాపా తరపున పెన్మెత్స సూర్యనారాయణ నామినేషన్ వేశారు. అంతుముందు ఆయనకు వైకాపా అధ్యక్షుడు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు నామినేషన్ పత్రాలను అందజేశారు. విజయనగరం జిల్లా మంత్రి బొత్స సహా ఇతర నేతలు దీనికి హాజరయ్యారు.
ఇవీ చదవండి