ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Nov 8, 2022, 5:01 PM IST

ఏపీ ప్రధాన వార్తలు

Ap Top News
ఏపీ ప్రధాన వార్తలు

  • "ఆయన ఏ పదవిలో ఉన్నా.. ఏనాడూ స్నేహితులను మరిచిపోలేదు"
    EX Vice President Venkaiah Naidu Met His Friend : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఏ పదవిలో ఉన్నా స్నేహితులకు ప్రాధాన్యం ఇస్తారని.. చెన్నైలో ఉంటున్న వెంకయ్యనాయుడి పాఠశాల ఫ్రెండ్​ నర్సారెడ్డి ఈటీవీ భారత్​కు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వాళ్లిద్దరూ బియ్యం బకాసురులు: తెదేపా నేత పట్టాభి
    TDP PATTABHI FIRES ON MINISTER : పేదలకు దక్కాల్సిన రేషన్​ బియ్యాన్ని మంత్రి కారుమూరి, ఎమ్మెల్యే ద్వారంపూడి పక్కదారి పట్టిస్తూ.. కోట్లు దండుకుంటున్నారని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. ఇద్దరు బియ్యం బకాసురులని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చంద్రబాబుపై దాడి చేసినవారిని శిక్షించాలని.. నందిగామలో సౌమ్య దీక్ష
    Tangirala Soumya agitation: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ర్యాలీలో రాళ్లదాడికి పాల్పడిననిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ.. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఒక్కరోజు దీక్షకు దిగారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమరావతి పాదయాత్ర రథం సెక్యూరిటీ గార్డులకు ముందస్తు బెయిల్‌
    Anticipatory Bail To Security Guards: అమరావతి పాదయాత్ర రథం ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ముందస్తు బెయిల్‌ కోసం అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సమస్యలు పరిష్కరించాలని.. గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల ఆందోళన
    Concerned about land dwellers: గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన నిర్వాసితులు ఆందోళనకు దిగారు. తమకు ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని ఉంగుటూరు-గన్నవరం ప్రధాన రహదారిలోని దావాజీగూడెం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఏడేళ్లుగా తమ సమస్య పరిష్కరించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ మరోసారి సమావేశం.. ఎప్పుడంటే??
    BIFURACTION MEETING : తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో మరోమారు భేటీ కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ.. ఏపీ, తెలంగాణ అధికారులకు సమాచారం పంపించి.. సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'చట్టానికి లోబడే తీర్పు'.. అత్యాచార దోషులకు శిక్ష రద్దుపై సుప్రీం వివరణ
    సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను నిర్దోషులుగా తేల్చడంపై విమర్శలు వెల్లువెత్తగా.. వాటికి తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. కింది కోర్టుల్లో ఈ కేసు విచారణ సమయంలో అనేక లోపాలు జరిగినట్లు పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానంలో నిందితులు నేరానికి పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న ధర్మాసనం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డీజే పాటలతో ఘనంగా మేకపిల్లల బర్త్​డే వేడుకలు
    చిన్నారుల పుట్టిన రోజు వేడుకల్లో కేక్​ కట్ చేయడం డీజే పాటలకు డ్యాన్స్​లు వేయడం చూస్తుంటాం. అయితే ఉత్తర్​ప్రదేశ్​లోని బాందాకు చెందిన రాజా అనే రిక్షా డ్రైవర్ తన వద్ద ఉన్న రెండు మేక పిల్లలకు పుట్టిన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాడు. అంతేకాకుండా డీజే డ్యాన్స్​లతో హోరెత్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IPL 2023: ఆ ఆటగాళ్లకు గుడ్​బై చెప్పనున్న సన్​రైజర్స్​.. లిస్ట్​ రెడీ చేసిన కావ్య​!
    IPL 2023: ఐపీఎల్ 2023 హడావుడి అప్పుడే మొదలైంది. వచ్చేనెలలో జరగనున్న మినీ వేలం కోసం అన్ని టీమ్​లు తాము రిటైన్​ చేసుకునే ప్లేయర్లను జాబితాను రెడీ చేస్తున్నాయి. అయితే ఆరెంజ్​ ఆర్మీ ఈ సారి చాలా మంది ఆటగాళ్లను ఉద్వాసన పలుకనున్నట్లు తెలుస్తోంది. వారెవరంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేను చావలేదు.. పోరాడతా.. అలాంటివి రాయొద్దు: సమంత ఎమోషనల్​
    యశోద ప్రమోషన్స్​లో పాల్గొన్న హీరోయిన్ సమంత తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ఇంకా చిత్ర విశేషాలను గురించి చెప్పుకొచ్చారు. ఆ సంగతులు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.