ETV Bharat / state

పురుగుల మందు తాగి.. వివాహిత ఆత్మహత్య

author img

By

Published : Feb 19, 2021, 3:18 PM IST

a women committed suicide
వివాహిత ఆత్మహత్య

విజయవాడ నగర శివారు కండ్రికలో సుధ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు నున్న గ్రామీణ పోలీసులు తెలిపారు.

విజయవాడ నగర శివారులోని కండ్రికలో సుధ అనే వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అద్దె చెల్లించలేదని.. ఇంటి యజమాని సామాన్లను రోడ్డుపై పడేసిన కారణంగా.. మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి బలవర్మరణానికి పాల్పడిందని స్థానికులు చెప్పారు. మృతురాలి తల్లి స్థానికంగానే ఉన్నప్పటికీ కూతురిని పట్టించుకోవడంలేదని తెలిపారు.

అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడై సుధ.. ఈ అఘాయిత్యం చేసుకుందని చెప్పారు. మృతురాలి భర్త లారీ డ్రైవర్​ అని.. విధి నిర్వహణ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నాడని గుర్తించిన పోలీసులు.. అతనికి సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గుండెపోటుతో పాఠశాలలోనే కుప్పకూలి ఉపాధ్యాయుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.