ETV Bharat / state

చెట్టును ఢీకొన్న బొలేరో.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

author img

By

Published : Feb 23, 2021, 6:48 AM IST

Updated : Feb 23, 2021, 1:33 PM IST

road accident
చెట్టును ఢీకొన్న బొలేరో.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురం వద్ద.. బొలేరో వాహనం చెట్టును ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు కూలీలు మృతిచెందగా.. 20మందికి గాయాలయ్యాయి.

చెట్టును ఢీకొన్న బొలేరో.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

గుంటూరు జిల్లా వినుకొండ మండలం పార్వతీపురంలో ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి గుంటూరుకు.. కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. 20మంది గాయపడ్డారు. భీముడు(50), శ్రీనివాస్(7), డ్రైవర్‌ ఉమేశ్ కుమార్ నాయుడు మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో 30 మంది ఉన్నారు. బాధిత కూలీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులకు వినుకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా కూలీ పనుల కోసం గుంటూరు వస్తున్నారు.

gv anjaneyulu visits vinukonda hospital
ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ వారిని పరామర్శించిన తెదేపా నేత జీవీ ఆంజనేయులు

పరామర్శించిన తెదేపా నేత జీవీ ఆంజనేయులు

వినుకొండ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని.. తెదేపా నేత జీవీ ఆంజనేయులు పరామర్శించారు. ఘటనలో మృతిచెందిన వారికి రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్న వ్యవసాయ కూలీల వాహనం ప్రమాదానికి గురికావడం దురదృష్టకరమన్నారు.

ఇదీ చదవండి: పోలవరంలో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం

Last Updated :Feb 23, 2021, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.