ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి

author img

By

Published : May 9, 2021, 10:55 PM IST

one died in road accident
one died in road accident

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామ సమీపంలో.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు వస్తుండగా.. వీరవట్నం గ్రామ సమీపంలోని అద్దంకి - నార్కట్​పల్లి హైవేపై ఆగి ఉన్న లారీని ఓ ద్విచక్రవాహనం ఢీకొనటంతో ప్రమాదం జరిగింది.

ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన.. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నం గ్రామ సమీపంలో జరిగింది. రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామానికి చెందిన నాగేంద్ర బాబు (28), కొర్రపోలు యాకోబు అనే ఇద్దరు వ్యక్తులు.. ప్రకాశం జిల్లా బండివారిపాలెం గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై గుంటూరుకు వస్తుండగా.. వీరవట్నం గ్రామ సమీపంలోని అద్దంకి - నార్కట్​పల్లి హైవేపై గల దద్దనాల ఆంజనేయస్వామి గుడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు.

ఈ ఘటనలో... వాహనం నడుపుతున్న నాగేంద్రబాబుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాదు. వాహనం వెనక కూర్చున్న యాకోబుకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నాగేంద్ర బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.హజరత్తయ్య తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనా రోగులకు అన్నదానం.. కమిటీగా ఏర్పడి సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.