పొత్తులపై అప్పుడే స్పష్టత.. ఓట్లు చీలకూడదనేది నా అభిప్రాయం: పవన్​

author img

By

Published : Jan 24, 2023, 3:43 PM IST

PAWAN ON ALLIANCE

PAWAN ON ALLIANCE: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీలకూడదు అన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నామన్న పవన్.. ఆ పార్టీ కాదంటే ఒంటరిగా వెళ్తామని తెలిపారు. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

PAWAN ON ALLIANCE : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై స్పష్టత ఎన్నికల ముందు వస్తుందని స్పష్టం చేశారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నామన్నా ఆయన.. బీజేపీ కాదంటే ఒంటరిగా వెళ్తామని స్పష్టం చేశారు. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి వెళ్తామని తేల్చిచెప్పారు. ఓట్లు చీలకూడదన్నదే తన అభిప్రాయమన్న పవన్‌.. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీకి విశ్వాసం సన్నగిల్లుతోందని విమర్శించారు. దావోస్ పర్యటనలో ఏపీ గురించి తెలిసిందే కదా అని వ్యాఖ్యానించారు. ఏపీలో లోకేశ్‌ పర్యటన, తన పర్యటన అడ్డుకుంటే వారికి వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేనట్లే అని తేల్చిచెప్పారు.

పొత్తులపై అప్పుడే స్పష్టత వస్తుంది.. ఓట్లు చీలకూడదు అనే నా అభిప్రాయం

"పొత్తులపై స్పష్టత ఎన్నికల ముందు వస్తుంది. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నాం. ఆ పార్టీ కాదంటే ఒంటరిగా వెళ్తాం. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి వెళ్తాం. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నా. 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే.. జగన్​ ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చేస్తోంది. వైఎస్​ఆర్​సీపీకి విశ్వాసం సన్నగిల్లుతోంది. లోకేశ్‌ పర్యటన, నా పర్యటనను అడ్డకుంటే వారికి నమ్మకం లేనట్లే." - పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

అంతకుముందు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ప్రచార రథం ‘వారాహి’కి వేదపండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించిన తర్వాత దాన్ని ఆయన ప్రారంభించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలివచ్చారు. గజమాలతో ఆయన్ను సత్కరించారు. అభిమానులకు ఓపెన్‌టాప్‌ వాహనం నుంచి పవన్‌ అభివాదం చేశారు.

సాయంత్రం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో జనసేన అధినేత సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచే అనుష్టుప్‌ నారసింహ యాత్రకు పవన్‌ శ్రీకారం చుడతారు. దీనిలో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన దశల వారీగా సందర్శించనున్నారు. ధర్మపురిలో దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.