ETV Bharat / state

భార్యాపిల్లలను బయటకు గెంటేశాడు..!

author img

By

Published : Nov 26, 2019, 4:49 PM IST

husband harassment to wife at guntur district
గుంటూరు జిల్లాలో భార్యపిల్లలను రోడ్డుపైకి నెట్టిన భర్త

ప్రేమ ఆప్యాయతలను పంచి... పిల్లలను, కట్టుకున్న భార్యను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన భర్త... కర్కశంగా మారాడు. భార్యాపిల్లలను రోడ్డుపైకి నెట్టి... ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. తమకు న్యాయం చేయాలంటూ... అర్బన్ ఎస్పీ కార్యాలయలంలో ఫిర్యాదు చేశారు ఆ కుటుంబసభ్యులు.

భార్యాపిల్లలను బయటకు గెంటేశాడు..!

గుంటూరు జిల్లా నందమూరి తారకరామారావు కాలనీకి చెందిన రమాదేవికి విజయరామిరెడ్డితో 24ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయరామిరెడ్డి గత రెండేళ్ల నుంచి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భార్యా, పిల్లలను వేధించడం ప్రారంభించాడు. శనివారం రాత్రి భార్యాపిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులను బెదిరించాడు. బాధితులు స్థానిక పోలీస్​స్టేష్​లో ఫిర్యాదు చేస్తే... ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ... అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: అప్పు చెల్లిస్తానని నమ్మించాడు... అదును చూసి చంపేశాడు

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.... ప్రేమ ఆప్యాయతలను పంచి... పిల్లలను కట్టుకున్న భార్యను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన భర్త కర్కశంగా మారాడు. కట్టుకున్న భార్యను, పిల్లలను రోడ్డు పైకి నెట్టి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. దిగ్గుతోచని స్థితిలో ఉన్న భార్య పిల్లలు ఇరుగుపొరుగు ఇచ్చేది తింటూ 2 రోజులు నుంచి రోడ్డుపైనే జీవనం సాగిస్తున్నారు. ఇదేంటి అని అడగడానికి వెళ్లిన స్థానికులను సైతం బెదిరిస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ అర్బన్ ఎస్పీ కార్యలయాలంలో ఫిర్యాదు చేశారు.

గుంటూరు నందమూరి తారకరామారావు కాలనీ కి చెందిన రమాదేవికి విజయ రామిరెడ్డి తో 24 ఏళ్ళు క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఒకరు బీఫార్మసీ మరొకరు బీటెక్ చదువుతున్నారు. విజయ రామిరెడ్డి గత రెండేళ్ల నుంచి మరోక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య పిల్లలను వేధించడం ప్రారంభించాడు. గత శనివారం రాత్రి ఇంటిలో ఉన్న సామాన్లు అన్ని లారీలో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. అడ్డు వచ్చిన భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఇదేంటి అని ప్రశ్నించిన స్థానికులను బెదిరించాడు. పిల్లలను, భార్యను వదిలేసి ఇల్లు ఖాళీచేసి వెళ్ళిపోయాడు. దిక్కుతోచని పిల్లలు ఏమిచెయ్యాలో అర్థంకాక గత 2 రోజులు నుంచి రోడ్డు పైనే పస్తులు ఉన్నారు. తాము చదువుకునే పుస్తకాలను సైతం తీసుకువెళ్లారని కట్టుకోవడానికి దుస్తులు కూడా లేవని భార్య రమాదేవి, పిల్లలు వాపోయారు. సమస్య ను పరిష్కరించాలని స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళితే పోలీసులు పట్టించుకువడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలంటూ అర్బన్. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.


Body:బైట్..... రమాదేవి, బాధితరాలు
బైట్...... హేమ , స్థానికులు


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.