ETV Bharat / state

దేవాలయ పరిసరాలను జియో ట్యాగ్​ చేస్తున్నాం: ఎస్పీ విశాల్​ గున్నీ

author img

By

Published : Jan 21, 2021, 2:11 PM IST

sp vishal gunni
ఎస్పీ విశాల్​ గున్నీ

దేవాలయాలు, విగ్రహాల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్​ గున్నీ చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు.

ఆలయాలు, విగ్రహాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టామని గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్​ గున్నీ చెప్పారు. దేవాలయాల పరిరక్షణకు సాంకేతికతను ఉపయోగిస్తూ గుడి పరిసర ప్రాంతాలను జియో ట్యాగ్ చేస్తున్నామని తెలిపారు. ఆలయాల వద్ద రెచ్చగొట్టే పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఆలయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ తెలిపారు. దేవాలయాల పరిరక్షణకు గ్రామాల్లో భద్రతా కమిటీలు వేస్తున్నామని చెప్పారు. రాత్రి పహారాలో భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మంగళగిరిలోని పచ్చళ్ల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.