ETV Bharat / state

విశాఖలో జీ-20, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సులు.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష

author img

By

Published : Jan 12, 2023, 10:05 PM IST

G-20 and global investors conferences: ఫిబ్రవరి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జీ-20 సదస్సుతో పాటుగా.. మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సుపై మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు ప్రతిష్ఠాత్మక సదస్సుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని సూచించారు. జీ 20 సన్నాహక సదస్సు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

CM Jagan holds review meeting
సీఎం సమీక్షా సమావేశం

CM Jagan holds review meeting with ministers: విశాఖపట్నంలో నిర్వహించనున్న రెండు ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లుపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా విశాఖపట్నంలో సదస్సులు నిర్వహించాలని అధికారులను జగన్ ఆదేశించారు. విశాఖ వేదికగా జీ-20 సదస్సు ఫిబ్రవరి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో జి–20 సన్నాహక సదస్సు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు వేదికగా.. వాస్తవిక పెట్టుబడులే లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని అధికారులను సీఎం ఆదేశించారు.

జీ -20 సమావేశాలపై సమీక్ష: జీ 20 సన్నాహక సదస్సు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమావేశం కోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని జగన్ పేర్కొన్నారు. ప్రధాన జంక్షన్లు, బీచ్‌ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. ఏర్పాట్లకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జీ -20 సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్టు అధికారులు జగన్​కు తెలిపారు. ఆయా ప్రతినిధులు పర్యాటక ప్రదేశాల సందర్శన సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు బాగా ఉండేలా చూసుకోవాలన్నారు.

విశాఖలో జి–20 కోసం ప్రపంచదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి ఆరుగురు చొప్పున హాజరు కానున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరవుతారని అధికారులు తెలిపారు.కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు.

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు: మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలన్నారు. కొత్త తరహా ఇంధనాల తయారీ సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలన్నారు. దీనికి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు ఊతం ఇవ్వాలన్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా వివిధ దేశాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. విదేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పారిశ్రామికవాడలను పరిశీలించాలని సీఎం సూచించారు. వాటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలన్నారు. విదేశాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలని, వాటి నిర్వహణా పద్ధతులను మన రాష్ట్రంలో అవలంభించడంపై దృష్టిపెట్టాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.