ETV Bharat / state

జగన్ సర్కార్ అంటే ప్రజలకు అసహ్యం కలుగుతోంది: యనమల రామకృష్ణుడు

author img

By

Published : Jan 12, 2023, 2:58 PM IST

yanamala
yanamala

Yanamala Ramakrishnadu: దేశంలోనే అత్యధిక డీజిల్, పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారు. జగన్ రెడ్డి సర్కార్ అంటే రాష్ట్ర ప్రజలకు అసహ్యం కలుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు.

Yanamala Ramakrishnadu: ధరలను పెంచి నడ్డి విరుస్తున్న జగన్ రెడ్డి సర్కార్ అంటే ప్రజలకు అసహ్యం కలుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు. రవాణా వాహనాల పన్ను పెంపుతో ప్రజలపై ఏటా 250 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. టీడీపీ పాలనలో రవాణా శాఖకు 6 నెలలకు రూ.1,500 కోట్ల వరకూ ఆదాయం వచ్చేది... జగన్‌ రెడ్డి బాధుడుతో 6 నెలల్లో రూ.2,131 కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. బైకు నుండి లారీ వరకు కొనుగోళ్లపై జీవిత పన్ను 6శాతం పెంచారన్నారు. దేశంలోనే అత్యధిక డీజిల్, పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. ఇప్పటికే 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు, 2 రెట్లు మద్యం ధరలు, 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలను దోచుకుంటున్నారని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.