ETV Bharat / state

ఐతేపల్లి వద్ద ప్రమాదం.. ఒకరు మృతి

author img

By

Published : Jan 26, 2021, 3:17 PM IST

road accident at ithepally chittoor district
ఐతే పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

చంద్రగిరి మండలం పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై ఐతేపల్లి వద్ద ద్విచక్రవాహం ప్రైవేటు బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పూతలపట్టు - నాయుడుపేట జాతీయరహదారిపై ఐతేపల్లి వద్ద ప్రమాదం జరిగింది. దోర్నగంబాలకు చెందిన అమర్నాథ్​రెడ్డి ఆటో నడిపిస్తూ.. జీవనం సాగిస్తుండేవాడు. ద్విచక్రవాహానంలో అమర్నాథ్ రెడ్డి అతని భార్య వెళుతున్న సమయంలో ప్రైవేట్​ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అమర్నాథ్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలా.. ఎక్కడ?.. సమాచారం లేదు.. ఆదేశాల్లేవు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.