ETV Bharat / state

కళాశాలకు వెళ్తూ.. కానరాని లోకానికి..!

author img

By

Published : Mar 10, 2021, 10:07 AM IST

road accident at chittoor district
కళాశాలకు వెళ్తూ.. కానరాని లోకానికి..!

రోజువారీగా కళాశాలకు బయలుదేరిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకానికి చేరాడు. అతడిని కర్నూలు జిల్లా ఆదోని పట్టణం తిరుమల నగర్​కు చెందిన ఎం.క్రిష్ణ దిలీప్​గా పోలీసులు గుర్తించారు.

కళాశాలకు బయలుదేరిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకానికి చేరాడు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం తిరుమల నగర్​కు చెందిన లీలా వెంకట శ్రీనివాస్ కుమారుడు ఎం.క్రిష్ణ దిలీప్.. రంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్​లో విద్యార్థి. తిరుపతి నగరంలో స్నేహితులతో కలిసి గదిలో అద్దెకు ఉంటూ.. బీటెక్ మూడో సంవత్సరం విద్యను అభ్యసించాడు. ద్విచక్రవాహనంపై కళాశాలకు బయలుదేరాడు. శ్రీనివాస్ మంగాపురం వద్ద ఉన్న నారాయణ కళాశాల సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి.. అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీ కొన్నాడు. తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108 సహకరాంతో తిరుపతి రుయాకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇదీ చూడండి:

'మీరు మమ్మల్ని బెదిరించినా సరే.. మాకు నచ్చిన వారికే ఓటేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.