ETV Bharat / state

అచ్యుతానంద గిరిస్వామి హత్యకేసు.. ఒకరు అరెస్ట్

author img

By

Published : Feb 17, 2021, 6:21 PM IST

person arrested in Achyuthananda Giri Swamy murder case
అచ్యుతానంద గిరి స్వామి హత్యకేసు

శ్రీశ్రీ రామతీర్థసేవా ఆశ్రమంలో అచ్యుతానంద గిరిస్వామి హత్యకేసును పోలీసులు ఛేదించారు. నెలకిందట హత్య జరగగా.. ప్రత్యేక బృందాలతో పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా ఐరాల మండలం పెయన్న గారిపల్లెలో శ్రీశ్రీ రామతీర్థసేవా ఆశ్రమంలోని అచ్యుతానంద గిరిస్వామిని గుర్తుతెలియని దుండగుడు హత్యచేసి.. రూ.52 వేల నగదును చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. జంగాలపల్లికి చెందిన బత్తల రామచంద్ర అనే వ్యక్తి నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. హత్యకు గల కారణాలను డీఎస్పీ సుధాకర్ వివరించారు. నిందితుడిపై గతంలోనూ పలు నేరారోపణలు ఉన్నట్టు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకోండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.