ETV Bharat / state

మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు హతం!

author img

By

Published : Jun 15, 2021, 12:42 PM IST

man murdered in alcohol intoxication at hyderabad
ప్రాణం తీసిన మద్యం మత్తు..

మద్యం మత్తులో జరిగిన స్వల్ప వివాదం.. హత్యకు దారి తీసింది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో.. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో మాట మాట పెరిగి ఘర్షణకు దిగారు. శ్రీనివాసులు అనే వ్యక్తి పెంచలయ్య అనే మరో కత్తితో దాడి చేసి హతమార్చాడు.

మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో.. హైదరాబాద్​కు చెందిన పెంచలయ్య, వరంగల్​కు చెందిన శ్రీనివాసులు పని చేస్తున్నారు. ఇద్దరు ఎస్​టీవీ నగర్​లో అద్దె ఇంటిలో ఉంటున్నారు. ఇద్దరూ మద్యం సేవించిన మత్తులో మాట మాట పెరిగి ఘర్షణకు దిగారు.

మొదట పెంచలయ్య కత్తితో శ్రీనివాసులుపై దాడి చేయగా... ఆవేశంతో శ్రీనివాసులు.. పెంచలయ్యను కత్తితో గొంతు లో పొడిచాడు. ఈ ఘటనలో పెంచలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి తూర్పు పోలీసులు శ్రీనివాసులుని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కాల్చి చంపాడు.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.