ETV Bharat / state

తిరుపతిలో కర్ణాటక మద్యం పట్టివేత.. ముగ్గురి అరెస్టు

author img

By

Published : Aug 10, 2020, 1:22 PM IST

తిరుపతిలో కర్ణాటక మద్యం పట్టివేత.. ముగ్గురు అరస్ట్
తిరుపతిలో కర్ణాటక మద్యం పట్టివేత.. ముగ్గురు అరస్ట్

చిత్తూరు జిల్లా రెండు రాష్ట్రాల సరిహద్దు కావడంతో ఎస్​ఈబీ అధికారుల సోదాలలో ప్రతిరోజు అక్రమంగా తరలిస్తున్న మద్యం లభిస్తూనే ఉంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తాజాగా కర్ణాటక మద్యాన్ని తిరుపతి పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు కార్లను, ఒక స్కూటర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


తిరుపతి రూరల్ మండలాలలో ఎస్​ఈబీ ఏఈఎస్ సుధీర్ బాబుకు అందిన రహస్య సమాచారం మేరకు అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిoచారు. అలిపిరి - చెర్లోపల్లి, తిరుపతి శెట్టిపల్లి మార్గాలలో దాడులు చేశారు. తిరుమలనగర్​కు చెందిన ముని భాస్కర్ తన ఇన్నోవా కారులో (572) కర్ణాటక మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పట్టకున్నారు. పోలీసులు ఆ మద్యాన్ని, ఇన్నోవా కారును స్వాధీనపరచుకొని కేసు నమోదుచేశారు.

మరో మార్గంలో మహీంద్ర మాక్స్ వాహనంతో పాటుగా ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. నిందితులు తిరుపతి రూరల్ మండలం ఎల్ ఎస్ నగర్​కు చెందిన గౌస్ బాషా , దామినీడుకు చెందిన వెంకటేశ్​ను అరెస్టు చేశారు. తిరుపతి ఆటోనగర్​కు చెందిన టి. నాగమోహన్ పారిపోయాడు. అతనిపై కేసు నమోదుచేశారు. రెండు కేసులలో భారీగా కర్ణాటక మద్యంతో పాటుగా ముగ్గురుని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు కార్లను, ఒక స్కూటర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్​ఈబీ అధికారి సుధీర్ బాబు తెలిపారు.

ఇవీ చదవండి

శేషాచలం అటవీ సమీప పంటపొలాలపై ఏనుగుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.