ETV Bharat / state

వైకుంఠ ద్వార దర్శనంపై తితిదే నిర్ణయాన్ని స్వాగతించిన భాజపానేత

author img

By

Published : Nov 30, 2020, 5:59 PM IST

bhanu prakash reddy comment on vaikunta ekadasi
తద్వారా సాధారణ భక్తులకు వైకుంట ద్వార దర్శనం

భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే తీసుకున్న నిర్ణయం పట్ల భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా వీఐపీలకే కాకుండా ఎక్కువ సంఖ్యలో సాధారణ భక్తులకు దర్శనం కలుగుతుందన్నారు.

వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల భాజాపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలుగుతుందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భాను ఈ అంశంపై స్పందించారు. మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి తితిదే మంచి నిర్ణయం తీసుకుందన్నారు.

ఇదీ చూడండి:

పులి, చిరుత, సింహాన్ని దత్తత తీసుకున్న ఎస్​బీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.