ETV Bharat / state

ఓట్ల కోసమే వస్తారా.. సమస్యలు పట్టించుకోరా... వైకాపా నేతను నిలదీసిన మహిళ

author img

By

Published : May 31, 2022, 6:04 PM IST

Updated : May 31, 2022, 7:03 PM IST

former MLA Visweswara Reddy
former MLA Visweswara Reddy

వైకాపా ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకూ..' కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు అడుగడుగునా నిలదీతలే ఎదురవుతున్నాయి. ఏ నాయకుడు.. ఏ గ్రామానికి, ప్రాంతానికి వెళ్లినా ప్రజలు ప్రశ్నలతో తీవ్ర తిరస్కారాన్ని తెలియజేస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరంలో కూడా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ఓ మహిళ నిలదీసింది.

Gadapa Gadapa Program in Uravakonda: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లత్తవరం తండా గ్రామంలో నిర్వహించిన 'గడప గడపకూ..'కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి చుక్కెదురైంది. కేవలం ఓట్ల కోసం మాత్రమే 'అమ్మా.. అయ్యా.. అంటూ వస్తారా.. సమస్యలు పట్టించుకోరా..' అంటూ ఓ మహిళ ప్రశ్నించింది. ఆమె భర్త పింఛన్​ను ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళ అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియని మాజీ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఓట్ల కోసమే వస్తారా.. సమస్యలు పట్టించుకోరా... వైకాపా నేతను నిలదీసిన మహిళ

ఇవీ చదవండి :

Last Updated :May 31, 2022, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.