ETV Bharat / state

బోరు వేయటానికి వెళ్లిన లారీ బోల్తా.. ఒకరు మృతి

author img

By

Published : Jun 10, 2020, 6:53 AM IST

ananthapuram district
బోరు వేయటానికి వెళ్లి బోల్తా పడ్డా లారీ.. బోరు బండిలోని వ్యక్తి మృతి

పొలంలో బోరు వేస్తుండగా అదుపు తప్పిన లారీ బోల్తా పడింది. బోరు బండిలో ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పి.కొత్తపల్లిలో జరిగింది.

అనంతపురం జిల్లా పామిడి మండలం పి.కొత్తపల్లిలో బోరు వేస్తుండగా లారీ అదుపు తప్పింది. బోరు వేసే వాహనంలో ఉన్న ఛత్తీస్ గఢ్​ వాసి బిజులు(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బోరు బండి యజమాని కుమరుడేనని పోలీసులు గుర్తించారు.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. పరారీలో ఉన్నాడు. మృత దేహాన్ని శవ పరీక్షల నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

బార్లు తెరిచేందుకు అనుమతి నిరాకరణ..కానీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.