ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

author img

By

Published : Mar 7, 2021, 3:18 PM IST

అధికార పార్టీ తరపున.. అనంతపురం జిల్లా కదిరిలో ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వార్డు వాలంటీర్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నామని కదిరి మున్సిపల్ కమిషనర్ చెన్నుడు తెలిపారు.

volunteers have been suspended for participating in elections campaign at ananthapur
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. అధికార పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వార్డు వాలంటీర్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీలోని 11వ వార్డు పరిధిలో వార్డు వాలంటీర్​గా పని చేస్తున్న ముగ్గురు.. పదో వార్డు అధికార వైకాపా అభ్యర్థి తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వాలంటీర్ల తీరుపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని తొలగించినట్లు కదిరి మున్సిపల్ కమిషనర్ చెన్నుడు తెలిపారు.


ఇదీ చదవండి:

నందిగామలో నేడు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.