ETV Bharat / state

'సమస్యలపై మేము రోడ్డెక్కాం - పట్టించుకోకుండా సీఎం జగన్‌ ఆడుకుంటున్నారు'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 8:47 PM IST

muncipal_workers_strike_on_across_the_state_in_second_day
muncipal_workers_strike_on_across_the_state_in_second_day

Muncipal Workers Second Day Strike : సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజూ ఉద్ధృతంగా సాగింది. మున్సిపల్‌ కార్యాలయాల వద్ద వినూత్న నిరసనలతో హోరెత్తించారు. కనీస వేతనం చెల్లించకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని తెల్

రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే సీఎం జగన్‌ మాత్రం బ్యాటు, బాల్‌తో ఆడుకుంటున్నారు- పారిశుద్ధ్య కార్మికులు

Muncipal Workers Second Day Strike: సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య, పొరుగు సేవల కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజూ ఉద్ధృతంగా సాగింది. మున్సిపల్‌ కార్యాలయాల వద్ద వినూత్న నిరసనలతో హోరెత్తించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ప్రధాన నగరాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ నిలిచిపోయింది. చెత్త తీసుకువెళ్లే ఆటోలు షెడ్లకు పరిమితమయ్యాయి. ఆటోల డ్రైవర్లు జీతాలు పెంచాలని కార్మికులతో పాటు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి గురువారం ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి సురేశ్‌ ఛాంబర్‌లో చర్చలు జరగనున్నాయి.

'హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తాం - ప్రభుత్వానికి మహిళా ఉద్యోగుల హెచ్చరిక'

Workers Strike in All Districts: ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజు ఆందోళనలు కొనసాగించారు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే సీఎం జగన్‌ మాత్రం బ్యాటు, బాల్‌తో ఆడుకుంటున్నారన్నారు. అనంతపురం నగరపాలిక కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు తెలుగుదేశం మద్దతు ప్రకటించింది. నంద్యాలలో మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప మున్సిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి కార్మికులు నినాదాలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెతో తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో వీధులు చెత్తమయంగా మారాయి.

మున్సిపల్​ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సైరన్ - ప్రభుత్వానికి హెచ్చరిక

Muncipal Workers Hike And Demands in Srikakulam : వేతనాల పెంపు, డిమాండ్ల సాధన కోసం శ్రీకాకుళంలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. ఏడు రోడ్ల కూడలి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికులు నిలువు దండాలు పెట్టారు. మూడేళ్లు గడస్తున్నా ఎలాంటి ఉద్యోగ భద్రత కల్పించలేదని క్లాప్ డ్రైవర్లు విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. చెత్త తరలించే వాహనాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉద్ధృతం - రెండో రోజు మున్సిపల్ కార్మికులు పోరు బాట

Workers Strike in Konaseema District: సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలంటూ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు దీక్షకు కూర్చున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి పారిశుద్ధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

పాదయాత్రలో ఇచ్చిన హామీలు మరిచావా జగనన్నా - ఏడో రోజు కొనసాగుతున్న ఎస్​ఎస్​ఏ ఉద్యోగుల సమ్మె

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.