ETV Bharat / state

నీటి కుంటలో పడి.. యువకుడు మృతి

author img

By

Published : May 1, 2021, 5:33 PM IST

man-dead-to-drop-into-water-pond-at-gutthi
నీటికుంటలో పడి యువకుడు మృతి

గుత్తి పట్టణంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలోని నీటి కుంటలో సూరి అనే యువకుడు.. తన స్నేహితులతో కలిసి సరాదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొడుతుండగా పట్టుతప్పి నీటిలో మునిగిపోయాడు.

సమాచారం అందుకున్న రూరల్ సీఐ రాము.. గజ ఈతగాళ్ల సహాయంతో సూరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నానికి సూరి మృతదేహం లభ్యమైంది. అతడి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రేపే తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.