ETV Bharat / state

ఆటో మొబైల్​ దుకాణంలో అగ్ని ప్రమాదం.. రూ.5 లక్షలకు పైగా నష్టం

author img

By

Published : Jan 7, 2021, 7:16 AM IST

fire accident at auto mobile shop
ఆటో మొబైల్​ దుకాణంలో అగ్ని ప్రమాదం

అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ఓ ఆటో మొబైల్​ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రూ.5 లక్షలకు పైగా నష్టం జరిగిందని యజమాని వాపోయారు.

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో బుధవారం రాత్రి ప్రభుత్వ ఆసుపత్రి కూడలి వద్ద ఉన్న వినాయక ఆటోమొబైల్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు.. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తాళం వేసి ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని యజమాని రమణ తెలిపారు. రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని వాపోయారు.

ఇదీ చదవండి:

అప్పుల బాధ తాళలేక గార్మెంట్స్ కార్మికుడు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.