ETV Bharat / state

CAR ACCIDENT: జాతీయ రహదారిపై కారు బోల్తా...ఇద్దరు మృతి

author img

By

Published : Jan 5, 2022, 11:18 AM IST

జాతీయ రహదారిపై కారు బోల్తా
జాతీయ రహదారిపై కారు బోల్తా

CAR ACCIDENT: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు.

CAR ACCIDENT: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం వెంకటాపురం తండా వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. పెనుకొండ వైపు నుంచి బెంగళూరు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కనున్న ప్రదేశంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడు రిజిస్ట్రేషన్‌కు చెందిన ఈ కారులో ప్రయాణించిన వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి: WHO Omicron: 'ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.