ETV Bharat / state

దొంగ అరెస్ట్.. 24 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

author img

By

Published : Jun 10, 2020, 2:05 PM IST

ananthapuram district
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్.. 24 వాహనాలు స్వాధీనం

అనంతపురం జిల్లాలో ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 24 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్ డీఎస్పీ కసీం సాహెబ్ ఆదేశాల మేరకు డోనేకల్ చెక్​పోస్ట్ వద్ద విడపనకల్ మండలానికి చెందిన భాస్కర్ అనే ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ద్విచక్రవాహనం దొంగలించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ కోసం గాలిస్తుండగా భాస్కర్​ పట్టుబడ్డాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన 24 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో 7, కర్నూల్ జిల్లాలో 10, కడపలో 1, కర్ణాటక 7 ద్విచక్రవాహనాలు దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో చొరవ చూపిన విడపనకల్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇది చదవండి 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు ... విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.