ETV Bharat / state

గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్షాల నిరసన

author img

By

Published : Jul 9, 2020, 8:14 PM IST

All-Party  leaders protest at gutti ananthapuram district
సబ్​జైలును..కొవిడ్ సెంటర్ గా మార్చడంపై అఖిలపక్షాల నిరసన

గుత్తి సబ్​జైలును.. ఖైదీలకు కొవిడ్ సెంటర్​గా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీ నాయకులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

అనంతపురం జిల్లా గుత్తి సబ్​జైలును ఖైదీలకు కొవిడ్ సెంటర్ గా ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ అఖిలపక్ష పార్టీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బైెెెఠాయించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... పట్టణంలో రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుంటే మరోపక్క సబ్​జైలును కొవిడ్ సెంటర్ గా మార్చడం ఎంతవరకు సమంజసమన్నారు.

సబ్​జైలు సమీపంలోనే సబ్​రిజిస్ట్రార్, కోర్టు, తహసీల్దార్, హౌసింగ్, మున్సిపాలిటీ కార్యాలయాలు ఉండటంతో నిత్యం ప్రజలు వస్తూ పోతుంటారని... అలాంటి రద్దీ ప్రాంతాలలో ఖైదీలకు కొవిడ్ సెంటర్ చేయడం విడ్డూరమన్నారు.

ఇదీ చదవండి: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.