ETV Bharat / sports

Neeraj Chopra Diamond League : డైమండ్‌ లీగ్‌లో నీరజ్​కు రెండో స్థానం.. సెప్టెంబర్​ 17న ఫైనల్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 7:03 AM IST

Updated : Sep 1, 2023, 7:47 AM IST

Neeraj Chopra Diamond League : స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ టోర్నీలో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఉత్కంఠగా జరిగిన ఈ పోటీల్లో స్వర్ణం సాధిస్తాడని అందరూ భావించినప్పటికీ.. రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Neeraj Chopra Diamond League
నీరజ్‌ చోప్రా డైమండ్​ లీగ్​

Neeraj Chopra Diamond League : ఇటీవలే జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడిన భారత స్టార్‌ జావెలిన్ త్రో ప్లేయర్​ నీరజ్‌ చోప్రా.. తాజాగా జరిగిన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌ వేదికగా జరిగిన ఈ డైమండ్‌ లీగ్‌ పోటీల్లో స్వర్ణం సాధిస్తాడని అందరూ భావించినప్పటికీ.. రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 80.70 మీటర్ల దూరం విసిరిన నీరజ్​.. ఆ తర్వాత రెండు, మూడు ప్రయత్నాల్లో ఫౌల్‌ అయ్యాడు. ఇక నాలుగు ప్రయత్నంలో 85.22 మీటర్లు విసిరిన నీరజ్.. రెండో స్థానంలోకి వచ్చాడు. అయితే ఐదో ప్రయత్నంలో మరోసారి ఫౌల్‌ అయ్యాడు. ఇక చివరి ప్రయత్నంలో 85.71 మీటర్లు విసిరాడు. మరోవైపు ఈ డైమండ్​ లీగ్​లో తొలి స్థానంలో జాకబ్‌ వాడ్లెజ్‌ (85.86) నిలిచాడు.

ఇక ఈ సీజన్ డైమండ్‌ లీగ్‌ల్లో భాగంగా మే 5న దోహాలో, జూన్‌ 30న లౌసానేలో నీరజ్‌ అగ్రస్థానం సాధించిన సంగతి తెలిసిందే. డైమండ్‌ లీగ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన చోప్రా.. తన ఖాతాలో ప్రస్తుతం 23 పాయింట్లును కలిగి ఉన్నాడు. యూజిన్‌లో సెప్టెంబర్‌లో డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌ జరగనుంది. ఇదే లీగ్‌లో లాంగ్‌జంప్‌లో భారత్‌ క్రీడాకారుడు శ్రీశంకర్‌ 7.99 మీటర్ల దూరం దూకి ఐదో స్థానంలో నిలిచాడు.

Neeraj Chopra Wins Gold World Athletics Championships 2023 : భారత స్టార్​ జావెలిన్‌ త్రోయర్​ నీరాజ్‌ చోప్రా మరో రికార్డు సృష్టించాడు. గతేడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్​లో రజతం గెలిచిన నీరజ్‌ ఈ సారి ఇదే మెగాటోర్నీ ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి.. స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు.

హంగేరిలోని బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరి ఈ ఘనత సాధించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా నీరజ్‌ చరిత్ర సృష్టించాడు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లోనూ నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడదే జోరును ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ కొనసాగించి సత్తా చాటాడు.

Neeraj Chopra Wins Gold : బల్లెం వీరుడు నీరజ్​ స్వర్ణ చరిత్ర.. ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో తొలి భారత అథ్లెట్​గా ఘనత

Neeraj Chopra Journey And Challenges : ఎన్నో అవమానాలు.. నీరజ్‌ లైఫ్ మలుపు తిరిగిందిలా.. బల్లెం వీరుడి కథ ఇది!

Last Updated :Sep 1, 2023, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.