సింధు, ప్రణయ్​కు నిరాశ.. ఇండియా ఓపెన్​ నుంచి ఔట్

author img

By

Published : Jan 17, 2023, 7:48 PM IST

hs pranay

భారత్​ వేదికగా జరుగుతున్న ఓపెన్​ సూపర్​ 750 బ్యాడ్మింటన్​ టోర్నీలో సింధు, ప్రణయ్​ వెనుతిరగాల్సి వచ్చింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​లో ప్రణయ్..​ డిఫెండింగ్ ఛాంపియన్ లక్ష్య సేన్ చేతిలో ఓడిపోగా.. సింధు థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కతేథాంగ్ చేతిలో ఓటమి పాలైంది.

ఇండియా ఓపెన్​ సూపర్​ 750 బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​ తొలి రౌండ్​లో టాప్​ ప్లేయర్స్​ పీవీ సింధు, హెచ్​ ఎస్​ ప్రణయ్​​ ఓటమిని చవి చూశారు. భారత్​ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​లో ప్రణయ్​ డిఫెండింగ్ ఛాంపియన్ లక్ష్య సేన్ చేతిలో ఓడిపోగా.. సింధు థాయ్‌లాండ్‌కు చెందిన సుపానిడా కతేథాంగ్ చేతిలో ఓటమి పాలైంది. సుమారు 45 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో 21-14, 21-15 స్కోర్​తో ప్రణయ్‌పై విజయం సాధించాడు. మరో వైపు పీవీ సింధు 12-21, 20-22 స్కోర్​తో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి సుపానిడా కతేథాంగ్‌ చేతిలో పరాజయం పాలయ్యింది. అయితే గత సీజన్​లో సెమీ ఫైనల్స్​కు చేరుకున్న సింధు ఇదే ప్లేయర్​ చేతిలోనే ఓటమి పాలవ్వడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.