ETV Bharat / sports

నేను ఫుల్​ ఫిట్​గా ఉన్నా.. కానీ దానికి ఇంకా టైం పడుతుంది : పీవీ సింధు

author img

By

Published : Feb 14, 2023, 5:16 PM IST

Updated : Feb 14, 2023, 5:25 PM IST

భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు.. దుబాయ్​ వేదికగా జరుగుతున్న ఆసియా మిక్స్​డ్​ టీమ్​ ఛాంపియన్​ షిప్స్​లో పాల్గొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. కానీ దానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. ఆ వివరాలు..

pv sindhu asian mixed team championships
pv sindhu asian mixed team championships

భారత స్టార్​ షట్లర్​, ఒలింపిక్​ మెడలిస్ట్​ పీవీ సింధూ.. తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఫుల్​ ఫిట్​గా ఉన్నట్లు చెప్పింది. కానీ ఫామ్​లోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. ఈ బ్యాడ్మింటన్​ ప్లేయర్.. మంగళవారం దుబాయ్​లో ప్రారంభమైన ​ఆసియా మిక్స్​డ్​ టీమ్​ ఛాంపియన్​ షిప్స్​లో పాల్గోంది. ఈ టోర్నమెంట్​లో సింధుతో పాటు, స్టార్ ప్లేయర్​ హెచ్​ఎస్​ ప్రణయ్​ భారత్​కు కీలకం కానున్నారు. ఈ టోర్నమెంట్​ ఫిబ్రవరి 19వరకు కొనసాగనుంది.

"నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. శారీరకంగా, మానసికంగా ఫుల్​ ఫిట్​గా ఉన్నా. గాయాలు అయ్యాయి.. కానీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ.. ప్రతిసారి మళ్లీ బలంగా తిరిగి రావడం చాలా ముఖ్యం. నేను చాలా కాన్ఫిడెంట్​గా, సానుకూలంగా.. నా పొరపాట్ల​ నుంచి నేర్చుకుంటున్నా. నేను కోల్పోయిన ఫామ్​ను కూడా తిరిగి పొందాలనుకుంటున్నాను. అయితే దానికోసం నేను పూర్తి కోలుకోవాలి. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను. కానీ.. మునుపటి ఫామ్​తో ఆడటానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. నా తల్లిదండ్రులు కూడా అథ్లెట్లే. అందుకే నేను గాయంతో బాధపడుతున్నప్పుడు వారు నాకు బాసటగా నిలిచారు. నాలో ప్రేరణ కలిగించారు."

--పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్​, ఒలింపిక్​ మెడలిస్ట్

గతేడాది పవీ సింధు సయ్యద్​ మోదీ ఇంటర్నేషనల్, స్విస్​ ఓపెన్, సింగపూర్​ ఓపెన్​ టైటిళ్లను సాధించింది. ఆ తర్వాత కామన్​వెల్త్​ గేమ్స్ ​2022లో మహిళల సింగిల్స్​లో గోల్డ్​ మెడల్​ సాధించింది. అయితే ఈ గేమ్స్​లోనే తన కాలికి గాయం అయింది. దీంతో ఆ తర్వాత జరిగిన టోర్నమెంట్లకు దూరమైంది. అనంతరం జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్​తో చాలా రోజుల తర్వాత ఆడింది. ఈ టోర్నీలో బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్​లో ఏడో స్థానంలో ఉన్న కరోలినా మారిన్​ చేతిలో ఓడిపోయి.. తొలి రౌండ్​లోనే నిష్క్రమించింది. అదే నెలలో జరిగిన ఇండియా ఓపెన్​లో కూడా మొదటి రౌండ్​లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి బయటకు వచ్చింది. ఈ ఓటముల కారణంగానే.. పూర్తిగా కోలుకోడానికి ఆ తర్వాత జరిగిన ఇండినేసియా, థాయ్​లాండ్​ మాస్టర్స్​ టోర్నీలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఈ ప్లేయర్​ వరల్డ్​ ర్యాంకింగ్స్​లో 9వ స్థానంలో కొనసాగుతోంది.

ఆసియా మిక్స్​డ్​ టీమ్​ ఛాంపియన్​ షిప్స్, ఇండియా స్వ్కాడ్​ :

  • పురుషుల సింగిల్స్ : లక్ష్యా సేన్, హెచ్​ఎస్​ ప్రణయ్
  • మహిళల సింగిల్స్ : పీవీ సింధు, ఆకర్షి కశ్యప్
  • పురుషుల డబుల్స్ : సాత్విక్ సాయిరాజ్​ రానిక్​రెడ్డి/ చిరాగ్ శెట్టి, కృష్ణ ప్రసాద్ గార్గా/ విష్ణు వర్ధన్​ గౌడ్ పి
  • మహిళల డబుల్స్ : త్రీసా జాలీ/ గాయత్రి గోపీచంద్, అశ్విణి భట్​/ శిఖా గౌతమ్​
  • మిక్స్​డ్​ డబుల్స్ : ఇషాన్ భట్నాగర్/ తనీషా క్రాస్టో
Last Updated :Feb 14, 2023, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.