ETV Bharat / sports

బాబర్​ అజామ్​కు కోహ్లీ ఆల్​ ద బెస్ట్, వీడియో వైరల్​

author img

By

Published : Aug 25, 2022, 5:09 PM IST

Updated : Aug 26, 2022, 6:56 AM IST

Virat Kohli meets Babar Azam ఆదివారం ప్రారంభమయ్యే ఆసియా కప్​ కోసం భారత్​ సహా అన్ని దేశాలు ప్రాక్టీస్​ను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే భారత్​, పాకిస్థాన్​ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్​ కలిసి ముచ్చటిస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.

virat kohli meets babar azam
virat kohli meets babar azam

Virat Kohli meets Babar Azam : భారత్​, పాకిస్థాన్ మ్యాచ్​ అంటే చాలు యావత్​ క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఆదివారం యూఏఈలో జరగబోయే ఈ పోరును వీక్షించేందుకు క్రికెట్​ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 27న యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియాకప్​ టోర్నీ కోసం భారత్​ సహా అన్ని దేశాల జట్లు ప్రాక్టీస్​ను మొదలుపెట్టాయి. ఈ తరుణంలోనే దాయాది జట్ల స్టార్​ ఆటగాళ్లు విరాట్​ కోహ్లీ, బాబర్​ అజామ్​ ఇద్దరు కలిసిన ఓ వీడియోను బీసీసీఐ ట్విట్టర్​లో పోస్ట్ చేయగా వైరల్​గా మారింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. అతనికి ఆల్‌ ద బెస్ట్ చెపుతూ కనిపించాడు.

భారత మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీ ఫామ్​ లేమితో సతమతమవుతుండగా.. పాకిస్థాన్​ కెప్టెన్​ బాబార్ అజామ్​ అన్ని పార్మాట్లలోను అదరగొడుతున్నాడు. మూడేళ్లుగా ఫామ్​లో లేని 'కింగ్​ కోహ్లీ' ఈ మ్యాచ్​తోనైనా తిరిగి ఫామ్​ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు విరాట్​ కోహ్లీకి ఇది వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్​ కావడం విశేషం. ​

Virat kohli on his bad form: ఆసియా కప్​కు సన్నద్ధమవుతున్న తరుణంలో తన బ్యాటింగ్​కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం తన బ్యాటింగ్​లో సమస్య ఎక్కడ ఉందో తెలియదన్నాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లీ.. తన కెరీర్​, ఫామ్​ గురించి మీడియాతో పంచుకున్నాడు.

"నా ఆట ఎక్కడ ఉందో నాకు తెలుసు. ఎత్తుపల్లాలను ఎదుర్కొనే సామర్థ్యం లేకపోతే.. అంతర్జాతీయ కెరీర్​లో ఇంత కాలంపాటు ప్రయాణించలేరు. నేను ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను ఆ దశను దాటి వచ్చాను. 2014 ఇంగ్లాండ్​ సిరీస్​లో ఆఫ్ సైడ్ పడ్డ బంతులను ఆడటమే నా సమస్య అని తెలుసు. కానీ, ఇప్పుడు సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందో చూపించగలిగే ఒక్క కారణం లేదు. నేను ఒక్కసారి బ్యాటింగ్​ బాగా చేస్తే చాలు.. తిరిగి ఫామ్​లోకి వస్తాను. నేను నిలకడగా ఆడతానని తెలుసు, ఆడగలను కూడా. అలాంటి గడ్డు పరిస్థితిని తిరిగి తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. దాని నుంచి నేర్చుకుంటాను. ఒక క్రీడాకారుడిగా, మనిషిగా విలువలను నేర్చుకుంటాను."

-విరాట్ కోహ్లీ, భారత మాజీ కెప్టెన్​

విరాట్ కోహ్లీ చివరిసారిగా జులైలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్​లో పాల్గొన్నాడు. ఈ సిరీస్​లోని రెండు వన్డేల్లో 16, 17.. రెండు టీ20ల్లో 1, 11 పరుగులు సాధించాడు. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్​, జింబాబ్వే పర్యటనలకు విశ్రాంతినిచ్చారు. కోహ్లీ 2019 నవంబర్​లో చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్​లో సెంచరీ చేశాడు.

ఇవీ చదవండి: క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్‌న్యూస్‌, భారత్​ పాక్​ మ్యాచ్​ టికెట్స్​ రిలీజ్​

ఆసియా కప్​లో అందరి కళ్లూ వీరిపైనే, ఆటతో అదరగొడతారా మరి

Last Updated : Aug 26, 2022, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.