ETV Bharat / sports

అభిమానులతో సూర్య, రోహిత్‌, పంత్‌ ముచ్చట్లు.. లైవ్​లోకి ధోనీ

author img

By

Published : Jul 27, 2022, 2:15 PM IST

రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు రిషభ్‌ పంత్‌. వీరంతా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. అయితే లైవ్​లోకి ధోనీని లాగేందుకు పంత్​ ప్రయత్నించడం గమనార్హం.

MS Dhoni's Cameo During Rishabh Pant's Instagram Live With Rohit Sharma, Suryakumar Yadav
అభిమానులతో సూర్య, రోహిత్‌, పంత్‌ ముచ్చట్లు.. లైవ్​లోకి ధోనీ

వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగళవారం టీమ్‌ఇండియా కీలక ఆటగాళ్లు ట్రినిడాడ్‌ చేరుకొన్నారు. ఈ నెల 29 నుంచి ఈ సిరీస్‌ మెదలవుతుంది. ఈ రోజు విండీస్‌తో టీమ్‌ఇండియా చివరి వన్డే ఆడనుంది. ఇది పూర్తయ్యాక పొట్టి సిరీస్‌కు సన్నద్ధం అవుతారు. అయితే, మంగళవారం సాయంత్రం యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌.. సహచరులు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌లతో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు.

ఈ సెషన్‌లో క్రికెటర్లు కొంతమంది అభిమానులతో సంభాషించారు. ఈ సమయంలో లైవ్‌లోకి ఎంఎస్‌ ధోనీని లాగడానికి పంత్‌ ప్రయత్నించాడు. కానీ, ధోని ఫోన్‌ను ఆఫ్‌ చేశాడు. అయితే, కాసేపటికి ధోని లైవ్‌లోకి రాగానే రోహిత్‌, సూర్య నవ్వడం మొదలుపెట్టారు. ఈ సెషన్‌లో ధోనితో పంత్ మాట్లాడుతూ..‘మహీ భాయ్‌ ఎలా ఉన్నావు? కాసేపు లైవ్‌లో ఉండు భయ్యా’ అని అన్నాడు. అయితే.. పంత్ ఈ విషయం చెప్పగానే ధోని నవ్వుతూ కెమెరా ఆఫ్‌ చేశాడు. ఆ తర్వాత పంత్‌, రోహిత్‌, సూర్య.. కాసేపు అభిమానులతో ముచ్చటించారు. క్రికెట్‌ సంగతులు పంచుకున్నారు.

ఇదీ చదవండి: 'చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్​కు అదే అతిపెద్ద బలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.