ETV Bharat / sports

పాక్-ఇంగ్లాండ్ సిరీస్ రద్దు.. ఐపీఎల్​కు మరింత జోష్

author img

By

Published : Sep 21, 2021, 6:21 PM IST

పాకిస్థాన్ పర్యటన దృష్ట్యా ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​కు దూరం కానున్నట్లు తెలిపిన ఇంగ్లాండ్​ ఆటగాళ్లు(England IPL 2021).. ఈ సీజన్​ చివరి వరకు ఆడనున్నారు. పాక్​ పర్యటనను రద్దు చేస్తూ ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు(England Tour of Pakistan) నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐపీఎల్​కు మరింత జోష్​ రానుంది.

england players
ఇంగ్లాండ్ ఆటగాళ్లు

ఇంగ్లాండ్​ జట్టు(England Tour of Pakistan) ఇటీవలే పాకిస్థాన్ పర్యటనను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఐపీఎల్(IPL 2021 News)​ మరింత జోష్​తో ముందుకు సాగనుంది. తొలుత పాక్​ పర్యటన దృష్ట్యా కొందరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు(England IPL 2021) ఐపీఎల్​కు దూరం కానున్నట్లు పేర్కొన్నారు. కానీ, పాక్ పర్యటన రద్దు చేస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో.. ఐపీఎల్​ చివరి వరకూ ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీల తరపున ఆట కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.

సామ్ కరన్, మొయిన్ అలీ, మోర్గాన్ సహా.. టామ్ కరన్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, జార్జ్ గార్టన్ ఐపీఎల్​ చివరి వరకు ఆడనున్నారు.

కొద్ది రోజుల క్రితమే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(New Zealand Tour of Pakistan) భద్రతా కారణాల దృష్ట్యా పాక్ పర్యటనను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా పాకిస్థాన్​కు షాకిచ్చింది. ఈ నిర్ణయంపై పీసీబీ ఛీఫ్ రమీజ్ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

Pak vs Nz: పాక్​కు క్రికెట్ కష్టాలు మళ్లీ మొదలు..?

ENG Vs PAK: కివీస్​ బాటలో ఇంగ్లాండ్​.. పాకిస్థాన్​ పర్యటన రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.