టీ20 ప్రపంచకప్ భారత జట్టులో మార్పులు.. శార్దూల్​కు చోటు

author img

By

Published : Oct 13, 2021, 5:24 PM IST

Shardul Thakur replaces all-rounder Axar Patel in India's main squad for T20 World Cup

టీ20 ప్రపంచకప్​ కోసం ఎంపిక చేసిన ప్రధాన జట్టులో టీమ్ఇండియా ఆల్​రౌండర్​ శార్దూల్​ ఠాకూర్​ను ఎంపిక చేసినట్లు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. అక్షర్ పటేల్​ స్థానంలో శార్దూల్​ను తీసుకుంది.

టీమ్ఇండియా ఆల్​రౌండర్​ శార్దూల్​ ఠాకూర్​ను టీ20 ప్రపంచకప్​ ప్రధాన జట్టులోకి తీసుకున్నట్లు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI News) ప్రకటించింది. అక్షర్​ పటేల్​ స్థానంలో శార్దూల్​కు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే టీ20 ప్రపంచకప్​ కోసం తొలిసారి ప్రకటించిన టీమ్​లో శార్దూల్​ను రిజర్వ్​ ఆటగాడిగా ఎంపిక చేయగా.. ఇప్పుడు అతడికి ప్రధాన జట్టులో ఆడే అవకాశం లభించింది.

మరోవైపు యువ ఆటగాళ్లు ఆవేశ్​ ఖాన్​, ఉమ్రాన్​ మాలిక్​, హర్షల్​ పటేల్​, లక్మన్​ మేరివాలా, వెంకటేశ్​ అయ్యర్​, కరన్ శర్మ, షాబాజ్​ అహ్మద్​, కృష్ణప్ప గౌతమ్​.. టీ20 ప్రపంచకప్​లో భారత జట్టుకు తమ సేవల్ని అందించనున్నారు. ఇందుకోసం వారంతా యూఏఈలో ఉన్న టీమ్ఇండియా శిబిరంలో చేరనున్నారు.

ఇదీ చూడండి.. IPL 2021: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా కోల్​కతా-దిల్లీ ఢీ.. ఇవి తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.